English | Telugu

ఆహాలో ‘కోట బొమ్మాళి పిఎస్‌’.. ఎప్పటి నుంచి అంటే..!

మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘నాయట్టు’ చిత్రాన్ని తెలుగులో ‘కోటబొమ్మాళి పిఎస్‌’ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. చాలా కాలం తర్వాత హీరో శ్రీకాంత్‌కి మంచి హిట్‌ పడిరది. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్‌, సినిమాలోని ‘లింగిడి..’ అనే పాట పెద్ద హిట్‌ అవ్వడంతో సినిమాపై బజ్‌ ఏర్పడిరది. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. కలెక్షన్లపరంగా కూడా టాక్‌ బాగానే వచ్చింది. మలయాళంలో మార్టిన్‌ ప్రక్కట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో తేజ మార్ని డైరెక్ట్‌ చేశారు. బన్ని వాస్‌, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా రిలీజ్‌ అయి నెల రోజులు కూడా దాటక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోందన్నది ఆ వార్త. డిసెంబర్‌ 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని సమాచారం. ఇటీవలి కాలంలో ఎంతో థియేటర్లలో రిలీజ్‌ అయిన తర్వాత ఎంతో స్పీడ్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. నితిన్‌ హీరోగా వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ కూడా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.