English | Telugu

వీరప్పన్‌ మళ్లీ వస్తున్నాడు.. ఏ రూపంలోనో తెలుసా?

వీరప్పన్‌ పేరు విననివారు, అతని గురించి తెలియని వారు ఉండరు. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి 30 సంవత్సరాలపాటు తప్పించుకొని తిరిగిన వీరప్పన్‌ చివరికి అనూహ్యం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అతని జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పటివరకు అతని జీవిత చరిత్రతో కూడిన సినిమాలు వచ్చాయి. అయితే రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

వీరప్పన్‌ జీవితంలోని విశేషాలను రెండున్నర గంటల సమయంలో చెప్పడం కష్టమైన పనే. అందుకే ఇప్పుడు వీరప్పన్‌ చరిత్ర సినిమా రూపంలో కాకుండా, వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కూసే మునిస్వామి వీరప్పన్‌’ అనే పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డీటైల్స్‌ కూడా విడుదల చేశారు. జీ 5లో డిసెంబర్‌ 8 నుంచి ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ జరుగుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు శరత్‌ జ్యోతి దర్శకత్వం వహించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.