English | Telugu

కథతో గ్రాఫిక్స్... గ్రాఫిక్స్ తో కథ కాదు

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "అవతారం". ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."ఒడిశాలో జరిగిన యధార్థ సంఘటన ఇది. పాలు అమ్ముకునే అమ్మాయి దుష్టశక్తిన్ని ఎదుర్కొని ఎలా పోరాడింది? అమ్మవారి అనుగ్రహం ఆమెకు ఎలా లభించింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎక్కడ గ్రాఫిక్స్ అవసరమో అక్కడ మాత్రమే వాడుకొన్నాం. గ్రాఫిక్స్ ను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వాడకూడదు. వాటికోసం కథ రాసుకోకూడదు.చిత్ర నిర్మాత యుగంధర్ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర అవుట్ పుట్ పట్ల మేమందరం పూర్తి సంతృప్తితో ఉన్నాము. ఇందులో రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేసారు. భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని" అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.