English | Telugu

ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరమే


నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘పటాస్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. జనవరి 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులను కలుసుకుని చిత్రయూనిట్‌ తమ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. ఒంగోలు, నెల్లూరు, బందరు, గుడివాడ, గుంటూరు, తిరుపతి, విజయవాడల్లో ఈ సక్సెస్‌ టూర్‌ కొనసాగింది. ఆదివారం విజయవాడలో విజయయాత్రను ఘనంగా ముగించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశర్వరావు, హీరో కళ్యాణ్‌రామ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌ అలంకార్‌ ప్రసాద్‌, ఎల్‌.వి.ఆర్‌. రాఘవ, శ్రీమన్నారాయణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు పది సంవత్సరాలు తర్వాత పటాస్‌ విజయం దక్కింది. ఈ విజయం నాదని అందరూ అంటున్నారు. కానీ ఈ సక్సెస్‌ నాది కాదు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలది. అందుకే ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు డేడికేట్‌ చేస్తున్నాను. ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరమే అవుతుంది’’ అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.