English | Telugu

అతడు 2.... రాబోతోంది




మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ’అతడు‘ ఎంత గొప్ప హిట్టో అందరికి తెలిసిందే. చివరికి సాటిలైట్ ఛానల్స్ లో ఎన్నోసార్లు వేసినా మంచి రేటింగ్ వస్తోంది. అలాంటి ఓ సినిమా మళ్ళీ చేయాలని ఆలోచన రాగానే. ఆ సినిమా కథకే సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందట మహేష్ కి, త్రివిక్రమ్ కి. జనం ఆదరించిన సబ్జెక్టు, కాబట్టి, అందులోనూ ఆ ఇద్దరిదీ క్రేజీకాంబినేషన్. దాంతో సై అంటే సై అనుకున్నారట. 'పార్ధు' అనే టైటిల్ (అతడులో మహేష్ క్యారక్టర్ పేరు) కూడా డిసైడ్ చేసారనే వార్త టాలీవుడ్ లో షికారు చేస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మళ్ళీ మనందరికి మంచి నవ్వుల విందు వుంటుందన్న మాట. పోనీలెండి ఈ మధ్య హిట్లు లేక విలవిల లాడుతున్న మహేష్ అతడు 2 తో అయినా ఓ హిట్టు అందుకుంటాడేమో.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.