English | Telugu

అదే తన చివరి సినిమా అంటున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌!

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జాతిరత్నాలు’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా ‘జాతిరత్నాలు’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే అంత పెద్ద హిట్‌ ఇచ్చిన దర్శకుడు అనుదీప్‌కి మళ్ళీ తెలుగులో సినిమా చేసే అవకాశమే రాలేదు. అయితే గత సంవత్సరం తమిళ్‌లో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్‌’ అనే సినిమా చేశాడు. అది ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమా రిలీజ్‌ అయి సంవత్సరం దాటుతున్నా.. అతని నెక్స్‌ట్‌ సినిమా ఏమిటి అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే రవితేజ హీరోగా ఒక సినిమా చేసే అవకాశం ఉందని, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 2016లో వచ్చిన ‘పిట్టగోడ’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనుదీప్‌ ఆ సినిమా తర్వాత దాదాపు 5 ఏళ్ళు గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది. 2021లో ‘జాతిరత్నాలు’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు.

‘జాతిరత్నాలు’ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ కూడా చేసిన అనుదీప్‌ లేటెస్ట్‌గా ‘మ్యాడ్‌’ సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కార్యక్రమంలో అనుదీప్‌ పాల్గొన్నాడు. తన కెరీర్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పాడు. ఇకపై తాను సినిమాల్లో నటించబోనని ప్రకటించాడు. ‘మ్యాడ్‌’ డైరెక్టర్‌ కళ్యాణ్‌ అడగడం వల్లే తాను నటించానని, అయితే ఇదే తన చివరి సినిమా అని, డైరెక్టర్‌గానే కొనసాగుతానని చెప్పాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.