English | Telugu

‘నువ్‌ కావాలయ్యా..’ పాటపై, తమన్నాపై విరుచుపడ్డ ప్రముఖ నటుడు!

ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ చేసేందుకు సెపరేట్‌గా నటీమణులు ఉండేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాను రాను వారికి డిమాండ్‌ తగ్గిపోయింది. ఎందుకంటే హీరోయిన్లే అలాంటి పాటల్లో ఒంపుసొంపులు చూపిస్తున్నారు కాబట్టి. ఇదేదో బాగుంది అని దర్శకనిర్మాతలు కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చి ఐటమ్‌ సాంగ్స్‌ చేయిస్తున్నారు. ఒకప్పటి ఐటమ్‌ సాంగ్స్‌ని చూసి ఎంజాయ్‌ చేసారు తప్ప వాటిపై ఎప్పుడూ కాంట్రవర్సీ రాలేదు. కానీ, ఇప్పుడొస్తున్న ఐటమ్‌ సాంగ్స్‌ కాంట్రవర్సీ అయిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించి వందల కోట్లు కొల్లగొట్టిన రజనీకాంత్‌ మూవీ ‘జైలర్‌’లో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్‌ కాస్తా.. అఫీషియల్‌గా స్పెషల్‌ సాంగ్‌గా మారింది. ‘నువ్‌ కావాలయ్యా..’ అంటూ సాగే ఈ పాట ఎంతో అసభ్యకరంగా ఉందని నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాలోని పాట ప్రస్తావన తెస్తూ తమన్నా డాన్స్‌ మూమెంట్స్‌ ఎంతో అసహ్యంగా ఉన్నాయని కామెంట్‌ చేశాడు. అలాంటి పాటకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ‘నువ్‌ కావాలి... రారా’ అంటూ రెండు చేతుల్ని కాళ్ళ మధ్యలోకి తెస్తూ తమన్నా వేసిన స్టెప్స్‌ చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించాడు మన్సూర్‌. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాకుండా, కోలీవుడ్‌ సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మన్సూర్‌ అలీఖాన్‌ ఈ పాటను ప్రస్తావిస్తూ సెన్సార్‌ బోర్డ్‌ను విమర్శించడానికి వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. అతను తీసిన ‘సరకు’ అనే సినిమాలోని పలు సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం చెప్పింది. కొన్ని కట్స్‌ ఇవ్వడమే కాకుండా చాలా సన్నివేశాలను మార్చాలని సూచించింది. దీంతో మన్సూర్‌ ఆగ్రహానికి గురయ్యాడు. అందుకే పనిగట్టుకొని ‘జైలర్‌’లోని స్పెషల్‌ సాంగ్‌ను, తమన్నాను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేశాడు. మరి దీనిపై కోలీవుడ్‌ సినీ ప్రముఖులు, సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.