English | Telugu

నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్!

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న 'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలేనని ఒకసారి.. కాదు ఎన్టీఆర్ విలన్ అని మరోసారి ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా 'వార్-2'లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లు బలంగా న్యూస్ వినిపిస్తోంది.

'వార్-2'లో ఎన్టీఆర్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయట. కేవలం 'వార్-2'లో మాత్రమే కాదు.. మొత్తం స్పై యూనివర్స్ కే ఈ పాత్ర చాలా కీలకమట. అందుకే నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా యిట్టే ఇమిడిపోతాడు. 'జై లవ కుశ' సినిమాలో రావణ(జై)గా నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు. ఇప్పుడు 'వార్-2'తో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఫిదా చేస్తాడు అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) కానుకగా రేపు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు. అలాగే మే 20న 'వార్-2' అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.