English | Telugu

ట్రెండ్ ఫాలో అవ్వను,సెట్ చేస్తా   

కిరణ్ అబ్బవరం ఈ నెల 18 న 'కే ర్యాంప్'(K Ramp)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని సాదిస్తు డిస్ట్రిబ్యూటర్స్ ని లాభాల బాటలో పయనించేలా చేస్తుంది. ఇక ఈ చిత్రం ప్రారంభ సన్నివేశంలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఇదేమిటమ్మ మాయా మాయా మైకం కమ్మిందా, ఆంధ్ర లోకం నిన్నునన్ను ఏకం కమ్మందా' అనే సాంగ్ ని రీ క్రియేట్ చేస్తు డాన్స్ చేస్తాడు. ఈ సాంగ్ కి కిరణ్ అబ్బవరం వేసిన హుషారైన స్టెప్స్ కి థియేటర్ లో ఒకటే విజువల్స్.

రీసెంట్ గా ఆ సాంగ్ ని చిత్రబృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ డాక్టర్ రాజశేఖర్(Rajasekhar),ఎన్ శంకర్ (Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'ఆయుధం'(Aayudham)చిత్రంలోనిది. వందేమాతరం సంగీత సారధ్యంలో బాలీవుడ్ అగ్ర గాయకుడు కుమార్ సాను తో కలిసి నిష్మా ఆలపించింది. చిన్ని చరణ్ సాహిత్యాన్ని అందించాడు. రాజశేఖర్ తో గుర్లిన్ చోప్రా(Gurleen Chopra)చిందులేయ్యగా 2003 లో ఆయుధం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కే ర్యాంప్ తో వచ్చిన క్రేజ్ తో ఒరిజినల్ సాంగ్ కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.