English | Telugu

'కాంతార చాప్టర్ 1' సంచలన రికార్డు!

ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన భారతీయ చిత్రంగా 'ఛావా' నిలిచింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ హిందీ సినిమా.. ఫిబ్రవరిలో విడుదలై రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. తాజాగా 'ఛావా'ను వెనక్కి నెట్టి, కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' టాప్ ప్లేస్ లోకి వచ్చింది. (Kantara Chapter 1)

'కాంతార'కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడో వారం పూర్తి చేసుకొని, నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన ఇండియన్ ఫిల్మ్ గా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇతర పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో.. మరో రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

2025 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో 'కాంతార చాప్టర్ 1', 'ఛావా' తరువాతి స్థానంలో రూ.500 కోట్లకు పైగా గ్రాస్ తో 'సైయారా' ఉంది. రూ.300 గ్రాస్ తో తెలుగు సినిమా 'ఓజీ' టాప్-10 లో చోటు దక్కించుకుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.