English | Telugu

'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత ఖర్చు చేశారా..!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడంతో 'వార్-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (War 2)

'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేశారు. 'వార్-2' రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అయిన ఖర్చు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు అని చర్చించుకుంటున్నారు.

భారీగా ఖర్చు అయినప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 'వార్-2'పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాని వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. ఆ తర్వాత చూస్తే మాత్రం.. ఈవెంట్ కోసం రూ.1.7 కోట్లు ఖర్చు చేయడం వల్ల నష్టమేమీ లేదని చెప్పవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.