English | Telugu

గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్ళిపై శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళి కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది కానీ.. ఇంతవరకు ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కలేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అవేవీ నిజం అవ్వట్లేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్ళి గురించి తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Prabhas)

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని తాజాగా శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసినట్లు తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. శివుడు అనుగ్రహిస్తే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అన్నారు. అమ్మాయి ఎవరు, పెళ్ళి ఎప్పుడు అనేవి తెలియవని.. కానీ, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.

శ్యామలాదేవి మాటలు విని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆమె కోరుకున్నట్టుగా త్వరలోనే ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కుతారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.