English | Telugu

థియేటర్స్ విషయంలో వార్ 2 కి అన్యాయం!.. అభిమానుల నిరాశ

'దేవర'(Devara)తో 2024 ని 'దేవర నామ సంవత్సరంగా' మార్చిన ఎన్టీఆర్(Ntr)అభిమానులు, ఇప్పుడు 'వార్ 2'(War 2)తో 2025 ని 'హృతిక్ రామారావు' నామ సంవత్సరంగా మార్చడనికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతు వార్ 2 తో ఒక కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు. ,ఎన్టీఆర్ నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా నెక్స్ట్ సినిమాలకి ఆ తరహాని అప్లై చేస్తానని చెప్పడం జరిగింది. దీంతో వార్ 2 లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించాడనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

వార్ 2 తెలుగు, హిందీతో పాటు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ లాంటి బిగ్ స్టార్స్ కావడంతో, వార్ 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు వార్ 2 కి తమిళనాట థియేటర్స్ తక్కువ దొరుకుతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 రిలీజ్ రోజైన ఆగస్టు 14 న 'సూపర్ స్టార్ రజనీకాంత్'(Rajinikanth)సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున(King Nagarjuna)ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో చేస్తుండటం, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో, కూలీపై తమిళ నాట భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కూలీ కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక వార్ 2 ఏపి, తెలంగాణ తో పాటు నార్త్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉన్నట్టుగా సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓవర్ సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పింది. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 ని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee)దర్శకత్వం వహించగా, నాలుగు దశాబ్దాల పై నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మిస్తు వస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించింది. కియారా అద్వానీ(Kiara Advani)కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.