English | Telugu

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నిఖిల్ వీడియో

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం ని సంపాదించిన హీరోల్లో నిఖిల్ సిద్దార్ధ కూడా ఒకడు. 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత పది సినిమాలకి పైగా చేసినా కూడా పొందని గుర్తింపుని 2022 లో వచ్చిన కార్తికేయ 2 ద్వారా పొందాడు.ఏకంగా కార్తికేయ 2 తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. లేటెస్ట్ గా నిఖిల్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ స్వయం భు. పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న ఈ మూవీలో యుద్దవిన్యాసాలు భారీగానే ఉండబోతున్నాయి. తాజాగా ఈ మూవీలోని తన క్యారక్టర్ దృష్ట్యా నిఖిల్ కత్తి విన్యాసాలని నేర్చుకుంటున్నాడు. చేతిలో కత్తి ఉందా లేదా అనే రీతిలో ఎడం చేత్తో నిఖిల్ చేసే విన్యాసాలకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళందరు నిఖిల్ కి సినిమా మీద ఉన్న కమిట్ మెంట్ ఎలాంటిదో అర్ధం చేసుకొని నిఖిల్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమా నుంచి తన కెరీర్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. స్పై ఇచ్చిన పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే అట్టహాసంగా ప్రారంభం అయిన స్వయంభు మూవీలో నిఖిల్ సరసన హిట్ చిత్రాల కథానాయిక సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తుండగా భరత్ కృష్ణమాచార్య దర్శత్వం వహిస్తున్నాడు. నిఖిల్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో కూడా స్వయం భు సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రవి బర్సుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.