English | Telugu

గుంటూరు కారం.. వచ్చే ఏడాది మోతమోగిపోతుంది!

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని మిగతా సాంగ్స్ కూడా అదిరిపోతాయని, కనీసం ఓ ఏడాది పాటు మోతమోగిపోతాయని అంటున్నారు.

సోమవారం నాడు 'ఆదికేశవ' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత నాగవంశీ.. 'గుంటూరు కారం' అప్డేట్ ఇచ్చారు. "గుంటూరు కారంలో ఇంకా మూడు పాటలున్నాయి. రెండో సాంగ్ వచ్చే వారం విడుదల చేస్తున్నాం. పాటలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అంతా పాడుకుంటారు. అంత బాగుంటాయి." అన్నారు నాగవంశీ.

జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.