English | Telugu

శ్రీరాముని క్యారక్టర్ కి సంబంధించిన సవాలు అర్ధం ఇదే.. భక్తులు,ప్రేక్షకుల రియాక్షన్ 

దర్శకుడు అనుకున్న కథ ప్రేక్షకుల మస్తిష్కాల్లోకి వెళ్లాలంటే 'మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చాలా ముఖ్యం. అందులోను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, థ్రిల్లర్ సబ్జెట్స్ అయితే, ఆ సంగీత దర్శకుడు ఇచ్చే మ్యూజిక్, బిజీఎం పైనే, చిత్ర విజయం స్థాయి ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మాట అక్షరాల నిజమని మరోసారి నిరూపించిన సంగీత దర్శకుడు 'గౌరహరి'(Gowra Hari). అందుకు తగ్గట్టే 'మిరాయ్'(Mirai)కి 'గౌరహరి' ఎంతో ప్లస్ అయ్యాడనే మాటలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.

రీసెంట్ గా మిరాయ్ సక్సెస్ ని పురస్కరించుకొని 'గౌరహరి మూవీకి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు 'మిరాయ్' లో మిగతా క్యారెక్టర్స్ కి బిజిఎం ఇవ్వడానికి ఒకటి రెండు రోజుల సమయమే పట్టింది. కానీ రామునికి పది రోజులు కేటాయించవల్సి వచ్చింది. దీంతో రాముని(Sri Ramudu)ఎపిసోడ్ కి ఇచ్చే బిజీఎం ని చాలా సవాలుగా తీసుకున్నాను. దాదాపు పదినిమిషాల పాటు సాగే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ లో చాలా కోణాలు కనిపిస్తాయి. రాముని వర్ణిస్తూనే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని సినిమా టిక్ ఫీల్ తో చెప్పడం కోసం చిన్న చిన్న ప్రయోగాలు చేశాను. 'రుధిర కరణ', 'రుధిర పవన', 'రుధిర విభవ' పాటకి 'భజే రాంచంద్రం' అనే 'రామాష్టకం' చేశాను. కానీ ఇది విడివిడిగా అనిపించకుండా ఒకే ఫ్లో లో సాగుతున్న సాంగ్ లాగా అనిపిస్తుంది. విరామ సమయంలో వచ్చే 'సంపాతి పక్షి' ఎపిసోడ్ కోసం ఒకే సారి నాలుగు జోనర్ల సంగీతం వినిపించే ప్రయత్నం చేసానని 'గౌరహరి' చెప్పుకొచ్చాడు.

గౌర హరి చెప్పినట్టుగానే 'మిరాయ్' మొత్తంపై వచ్చే నేపధ్య సంగీతం ఒక ఎత్తయితే, ఇంటర్వెల్ లో వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్, క్లైమాక్స్ లో రాముడికి ఇచ్చిన బిజీఎం ఒక ఎత్తు. రాముని భక్తులతో పాటు, ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది. అప్పుడే చాలా మంది తమ రింగ్ టోన్స్ గా కూడా యాడ్ చేసుకున్నారు. గత ఏడాది రిలీజై పాన్ ఇండియా వ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్న హనుమాన్ కి కూడా 'గౌరహరి' నే మ్యూజిక్ ని అందించాడు. కాకపోతే ఆ చిత్రానికి రావాల్సిన క్రెడిట్ పూర్తిగా రాలేదనే పట్టుదలతో 'మిరాయ్' కి వర్క్ చేసి ప్రేక్షకుల్లో తన కంటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లోనే 'పినాక, జాంబిరెడ్డి పార్ట్ 2 , రణమండల, కాల చక్ర అనే చిత్రాలకి వర్క్ చేస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.