English | Telugu

గోపీచంద్ 'లౌక్యం'తో 'లక్ష్యం' చేరుతాడా..!

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'లౌక్యం'. 'లక్ష్యం' తర్వాత శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా ఇది. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న గోపీచంద్ కి ఈ సినిమా తప్పక విజయాన్ని అందిస్తుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రొటీన్ మాస్ సినిమాలాగా కాకుండా ఓ మంచి కథను ఈ సినిమాను గోపీమోహన్, కోనవెంకట్ అందిచారట. అలాగే బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమాను చూసిన యూనిట్ సభ్యుల్లో ఒకరైన గోపిమోహన్ గారు తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో సినిమా గురించి చెపుతూ "'లౌక్యం' ఫస్ట్ కాపీ చూశాను, ఈ సినిమా గోపిచంద్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది" అని తెలిపారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.