English | Telugu

'గీత శంకరం' మూవీ హీరోగా రిషి సర్

బుల్లితెర మీద సీరియల్స్ లో నటించి, కామెడీ షోస్ లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీదకు కూడా వెళ్లి మంచి మంచి రోల్స్ లో నటిస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు రిషి సర్ వంతు వచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ నటుడు రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడకి ఎంత మంది లేడీ ఫాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. సీరియల్ లో రిషి సర్ ఆటిట్యూడ్ కి యూత్ ఫాన్స్ కూడా చాలా ఎక్కువమంది ఉన్నారు. ఈయన కన్నడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగులో ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈయన నటించిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యాడు. అలాంటి యంగ్ హీరోకి ఇప్పుడు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రియాంక శర్మ, ముఖేష్ గౌడ హీరో హీరోయిన్స్ గా " గీతా శంకరం" అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో భాగంగా పచ్చని పొలాల మధ్య హీరో హీరోయిన్ ఇద్దరు బైక్ పై వెళ్తున్నట్టు చూపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ముఖేష్ గౌడ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బుల్లితెరపై తనను ఎంతగా ఆదరించారో అలాగే రాబోయే మూవీని కూడా ఆడియన్స్ అంతా చూడాలని కోరారు. ఇక తనకు ఇలా సినిమాలలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రేమకథ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ నెల 14 నుండి షూటింగ్ పనులు జరుగుతాయంటూ ప్రకటించారు చిత్రయూనిట్. అచ్చమైన విలేజ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ముఖేష్ గౌడ స్పష్టం చేశారు.

ఇప్పటికే సుడిగాలి సుధీర్ బుల్లితెర నుంచి వెళ్లి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు... అలాగే వేణు వండర్స్ డైరెక్టర్ గా బలగం మూవీ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రౌడీ రోహిణి బుల్లితెర నుంచి అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కామెడీ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇలా రష్మీ, అనసూయ ఇలా ఎంతో మంది సిల్వర్ స్క్రీన్ మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.