English | Telugu

రేవంత్ రెడ్డి గురించి అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు!

పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 'గద్దర్'(Gaddar)అవార్డుల్ని ఈ రోజు ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ మాట్లాడుతు అవార్డుల ప్రకటనలో ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలతో పాటు మంచి సినిమాలని గద్దర్ అవార్డ్స్ కి సెలెక్ట్ చేశామని చెప్పడం జరిగింది.

ఆమె చెప్పిన మాట అక్షర సత్యమనే నిజం అవార్డుల్ని ప్రకటించిన తర్వాత అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. పుష్ప 2(Pushpa 2)రిలీజ్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్(Allu Arjun)పై కేసు నమోదు కావడంతో పాటు ఒక రోజు జైలులో కూడా ఉన్నాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా కావాలనే అల్లుఅర్జున్ ని జైల్లో ఉంచిందనే వాదనలని పలువురు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్స్ అనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో పుష్ప 2 కి సంబంధించి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించింది. దీంతో ఆర్టిసుల మీద తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించదని చెప్పడానికి, ఇంతకంటే ఉదాహరణ ఉండదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన నేపథ్యంలో, జూన్ 14 న హైదరాబాద్ లో ఎంతో వైభవంగా ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు అల్లు అర్జున్(Allu Arjun)హాజరు కావాల్సిందే. రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లుఅర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకోవాలి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో ఉంది. అల్లు అర్జున్ అభిమానులైతే తమ హీరోకి గద్దర్ అవార్డు రావడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.