English | Telugu

"గబ్బర్ సింగ్" ఎంట్రీకి రంగం సిద్ధం

టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు తిరగరాసిన ది వన్ అండ్ ఓన్లీ గబ్బర్ .. "గబ్బర్ సింగ్". ఇలాంటి మాస్ గబ్బర్ సింగ్ ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "గబ్బర్ సింగ్ -2" చిత్రం తెరకెక్కబోతుంది.


ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇది "గబ్బర్ సింగ్" చిత్రానికి సీక్వెల్ కాదని ఇది వరకే దర్శకుడు సంపత్ నంది తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడైన శరత్ మరార్ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.