English | Telugu

ఫిల్మ్ ఫేర్ పై ఫైర్ అవుతున్నారు

త‌మ ఫేవ‌రేట్ హీరో సూప‌ర్బ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చినా.. ఓ అవార్డు క‌మిటీ నామినేష‌న్‌కి సైతం క‌న్సిడ‌రేష‌న్ చేయ‌లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాస్తంత వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల ఫిల్మ్ ఫేర్ సంస్థ 2014కి గానూ 'బెస్ట్' కేట‌గిరిల‌ను రిలీజ్ చేసింది. వీటిలో 'బెస్ట్ యాక్ట‌ర్' కేట‌గిరిలో గ‌తేడాదికి గానూ ఇద్ద‌రు పాపుల‌ర్ హీరోలు నామినేట్‌ కాలేదు. '1 నేనొక్క‌డినే' కోసం బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన త‌మ అభిమాన క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబుని ఫిల్మ్ ఫేర్ నిర‌క్ష్యం చేసిందంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ ఓ వైపు.. 'లెజెండ్' కోసం సూప‌ర్బ్ యాక్టింగ్ చేసిన త‌మ ఫేవ‌రేట్ హీరో బాల‌కృష్ణ ని బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరిలో స్థాన‌మివ్వ‌లేదంటూ బాల‌య్య అభిమానులు మ‌రో వైపు ఫిల్మ్ ఫేర్ పై ఫైర్ అవుతున్నారు. ఫిల్మ్ ఫేర్ ఏ ఏ కార‌ణాల‌తో ఈ స్టార్ హీరోల‌ని ప‌ట్టించుకోలేదో కానీ.. ఇప్పుడు ఫ్యాన్స్ ఫైరింగ్ మాత్రం ఆ సంస్థ‌ని ఇబ్బంది పెడుతుందంటూ క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.