English | Telugu

జోరు మీదున్న త‌మ‌న్నా

స‌క్సెస్‌ల‌తో జోరుగా ఉండ‌డం న‌థింగ్ స్పెష‌ల్‌. కానీ ఫెయిల్యూర్స్‌తోనూ అదే జోరుని మెయిన్ టెయిన్ చేయ‌డం స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. తేనెక‌ళ్ల బ్యూటీ త‌మ‌న్నాని రెండో కేట‌గిరికి చెందిన హీరోయిన్‌గా మెన్ష‌న్ చేయొచ్చు. గ‌త‌కొంత‌కాలంగా అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ సిరీస్ ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మైన త‌మ‌న్నా.. వ‌చ్చిన ప్ర‌తి మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకోకుండా త‌న టాలెంట్‌ని అస్త్రంగా ప్ర‌యోగిస్తోంది. ఫ‌లితంగానే రానున్న మూడు నెల‌ల్లో నెల‌కో సినిమాతో ప‌ల‌క‌రించేందుకు ఈ మిల్కీ బ్యూటీ రెడీ అయింది. జులై 10న భారీ బ‌డ్జెట్ మూవీ 'బాహుబ‌లి'తోనూ.. ఆగ‌స్టు 14న త‌మిళ చిత్రం 'వాసువుమ్ శ‌ర‌వ‌ణ‌నుమ్ ఒన్న ప‌డిచ్చ‌వాంగ' (ఇందులో ఆర్య హీరో)తోనూ.. సెప్టెంబ‌ర్ 19న ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' తోనూ సంద‌డి చేయ‌బోతోంది త‌మ‌న్నా. ఈ వైనంతో 'ఫ్లాప్‌లు వ‌చ్చినా జోరుని కొన‌సాగించ‌డం ఎలా.. అనేదానికి త‌మ‌న్నానుంచి స‌ల‌హాలు అడిగితే పోలా..' అనుకుంటున్నారట‌ తోటి క‌థానాయిక‌లు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.