English | Telugu

దిల్‌రాజు య‌వ్వారం బ‌య‌ట‌ప‌డింది

`14మందితో సిండికేట్` ...ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తున్న ప‌దం ఇది. ప‌ద్నాలుమంది నిర్మాత‌లు ఓ గ్రూపుగా ఏర్ప‌డి, మీడియాకి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా, వాళ్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది. త‌మ‌న‌కు అనుకూల‌మైన ఛాన‌ళ్ల‌కే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ మొత్తం గ్యాంగ్‌కి.. దిల్‌రాజు లీడ‌ర్‌. సురేష్ బాబులాంటి హేమా హేమీలు ఈ గ్యాంగ్‌లో ముఖ్య వ్య‌క్తులు. సినిమా చిన్న‌దైనా, పెద్ద‌దైనా కొన్ని ఛాన‌ళ్లు, న్యూస్ పేప‌ర్ల‌కే యాడ్లు ఇవ్వాలన్న‌ది వీళ్ల నిర్ణ‌యం. ఈ గ్యాంగ్‌లో చేరితే... సిండికేట్ నియ‌మావ‌ళిని అనుస‌రించాల్సిందే. అయితే ఆ నియ‌మాల‌ను ప‌క్క‌కు తోశాడు దిల్‌రాజు. ఎందుకంటే త‌న సినిమా `కేరింత‌`కు ఎక్క‌డ దెబ్బ‌ప‌డిపోతోందో అన్న‌భ‌యంతో.

ఇటీవ‌ల దోచేయ్‌, పండ‌గ చేస్తోలాంటి సినిమాలువ విడుద‌ల‌య్యాయి. వీటి విష‌యంలో దిల్‌రాజు చాలా నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించాడు. ఏబీఎన్‌ ఆంధ్ర‌జ్యోతితో స‌హా పెద్ద ఛాన‌ళ్లుకు యాడ్లు ఇవ్వ‌కుండా చేశాడు. దాంతో ఆంధ్ర‌జ్యోతి ఈ రెండు సినిమాల్నీ ఏకిప‌డేసింది. పండ‌గ చేస్కో సినిమాకి దండ‌గ చేస్కో అంటూ రివ్యూ రాసి నిప్పులు చెరిగింది. దాంతో దిల్‌రాజు కంగారు ప‌డ్డాడు. త‌న సినిమా `కేరింత‌`కు ఆంధ్ర‌జ్యోతికి పిలిచి మ‌రీ యాడ్లు ఇచ్చాడు. దాంతో దిల్‌రాజు య‌వ్వారం బ‌య‌ట‌ప‌డింది.

`నీకో న్యాయం మాకో న్యాయ‌మా` అంటూ సిండికేట్లో ఉన్న సాటి నిర్మాత‌లు దిల్‌రాజుపై నిప్పులు చెరుగుతున్న‌ట్టు భోగ‌ట్టా. కేరింత సినిమాని కాపాడుకోవ‌డానికే దిల్‌రాజు యాడ్లు ఇచ్చాడ‌న్న‌ది సుస్ప‌ష్టం. అంటే త‌న సినిమాకి మాత్రం నెగిటీవ్ టాక్ రాకూడ‌దు, బ‌య‌టి సినిమాలు ఎలా పోయినా ఫ‌ర్లేదా? ఇదే విష‌యం దిల్‌రాజుని అడిగితే `నేను సిండికేట్‌లోనే ఉన్నా.. కొన్ని నిబంధ‌ల మేర‌కు యాడ్లు ఇవ్వాల్సి వ‌చ్చింది` అంటూ క‌వ‌రింగు చేసుకొంటున్నాడ‌ట‌. మ‌రి ఈ మాట‌ల్ని నిర్మాత‌లు నమ్ముతారా? ఈ సిండికేట్ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఊడుతుందా?? అనేది భ‌విష్య‌త్తే తేల్చాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.