English | Telugu

అప్పుడు షారుఖ్ తో ఫోటో దిగానంటే నవ్వారు.. ఇప్పుడేకంగా షారుఖ్ తో సినిమా చేశాడు

మన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. వాటిని చిరునవ్వుతో దాటుకుంటూ ఒక్క మెట్టు ఎక్కుతూ, మనల్ని అవమానించిన వాళ్ళే మన గెలుపుని చూసి చప్పట్లు కొట్టేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఈ మాట కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ కి సరిగ్గా సరిపోతుంది.

అది 2013, మే 14. అప్పటికి ఇంకా అట్లీ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'రాజా రాణి' కూడా విడుదల కాలేదు. 'షారుఖ్ ఖాన్ సార్ తో నేను' అంటూ అట్లీ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేశాడు. అది చూసి కొందరు ఎడిటెడ్, ఫోటోషాప్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ లో 'రాజా రాణి' సినిమా విడుదలై దర్శకుడిగా అట్లీ ప్రతిభను తెలియజేసింది. అనంతరం 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' వంటి వరుస విజయాలతో కోలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో 'జవాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పదేళ్ల క్రితం షారుఖ్ తో ఫోటో దిగానని అట్లీ అంటే కొందరు నవ్వారు. ఇప్పుడు అదే షారుఖ్ తో సినిమా చేసి ట్రైలర్ తోనే దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టిస్తున్నాడు. దీంతో 'అట్లీ 10 ఇయర్స్ ఛాలెంజ్' అంటూ ఆయనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ లు పెడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.