English | Telugu

బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చాడు.. మ‌రి అబ్బాయ్‌కి??

సినిమా ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి ఫేట్ ఎలా తిరుగుతుందో చెప్ప‌లేం. ఫ్లాప్ లో ఉన్న‌వాళ్లు స‌డ‌న్‌గా ఓ బంప‌ర్ హిట్ కొట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. హిట్ బాట‌లో ఉన్న‌వాళ్లు అట్ట‌ర్ ఫ్లాప్ ఇచ్చి... షాకిస్తారు. ఏ.ఎస్. ర‌వికుమార్ జీవిత‌మూ అంతే. ర‌చ‌యిత‌గా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ర‌వికుమార్ చౌద‌రి - య‌జ్ఞంలాంటి సూప‌ర్ హిట్ తీశాడు. ఆ త‌ర‌వాత నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి పిలుపు అందుకొంది. ఇక మ‌నోడు టాప్ లిస్టులో చేరిపోవ‌డం ఖాయ‌మ‌నుకొన్నారంతా. కానీ.. వీర‌భ‌ద్ర అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో... కెరీర్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. నితిన్‌, త‌నీష్‌ల‌తో సినిమాలు చేసినా ఉప‌యోగం లేకుండా పోయింది. ఆ త‌ర‌వాత పిల్లా నువ్వు లేని జీవితంతో.. మ‌ళ్లీ గాడిన ప‌డ్డాడు. ఇప్పుడు మ‌రో నంద‌మూరి హీరో నుంచి పిలుపు అందుకొన్నాడు. ప‌టాస్ తో జోరుమీదున్నాడు క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు ర‌వికుమార్ చెప్పిన క‌థ ఓకే చేశాడ‌ట‌. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తార‌ని టాక్‌. మ‌రి బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. అబ్బాయికి ఎలాంటి షాక్ ఇస్తాడ‌న్న‌ది నంద‌మూరి అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. షేర్ సినిమాతో బిజీగా ఉన్న‌క‌ల్యాణ్‌రామ్‌.. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడ‌ని తెలిసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.