English | Telugu

దిల్ రాజు "కేరింత"

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, సాయిధర్మతేజ హీరోగా, సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "కేరింత" అనే చిత్రాన్ని నిర్మించనున్నారట. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడే ఈ హీరో సాయిధర్మ తేజ. సాయి ధర్మతేజ ఇప్పటికే వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో "రేయ్" అనే చిత్రంలో నటిస్తున్నాడు.

"రేయ్" అతనికి తొలి చిత్రం కాగా "కేరింత" రెండవ చిత్రం అవుతుంది. ఈ "కేరింత" చిత్రంలో ముందుగా నాగచైతన్య హీరోగా నటిస్తాడనుకున్నారు. కానీ నాగచైతన్య డేట్స్ లభించనందువల్ల ఆ స్థానంలో సాయిధర్మ తేజను హీరోగా తీసుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ "కేరింత" చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.