Read more!

English | Telugu

భర్త గెలుపు కోసం అజ్మీర్ లో ధోనీ భార్య ప్రార్థనలు

భర్త గెలుపు కోసం అజ్మీర్ లో ధోనీ భార్య ప్రార్థనలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే భారత దేశానికి క్రికెట్లో 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్పుని అందించిన తర్వాత మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 2011 లో క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ క్రికెట్ ప్రపంచకప్ భారతదేశం గెలవటంతో ఆ రోజంతా భారతదేశం మొత్తం కుల,మత,భాషా భేదాలకతీతంగా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంది. మనలో మనకి ఎన్ని తేడాలున్నా ఈ విషయంలోమాత్రం భారతీయులంతా ఒక్కటేనని మరోసారి నిరూపించబడింది.

అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ ఐపియల్ మ్యాచులాడుతున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున కెప్టెన్ గా ఆడుతుండటంతో అతని టీమ్ గెలవాలనీ, అతనికి కెప్టెన్ గా మంచి పేరు రావాలనీ, అతని భార్య సాక్షి రావత్ ఇటీవల అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపింది. మరి అజ్మీర్‍ దర్గాలోని దేవుడు సాక్షి రావత్ ప్రార్థనలు విన్నాడో....? లేదో...?