English | Telugu

అప్పులు తీర్చలేకపోతున్నా...అందరికీ సారీ...

టీవీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఒక విషాదం నెలకొంది. ఢీ షోలో ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకుని మరణించారు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉండి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా ఒక వీడియోని రికార్డు కూడా చేసాడు. తన మరణానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని అందులో పేర్కొన్నారు. సూసైడ్ చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు పేరుపేరునా ఈ వీడియోలో సారీ చెప్పాడు చైతన్య. అప్పులు చేసాను కానీ వాటిని తీర్చలేకపోతున్నానంటూ బాధపడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థంకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పుకుని బాధపడ్డాడు. ఎంత ట్రై చేసినా అప్పులు తీర్చలేకపోతున్నానని ఇక తన వేరే మార్గం కనిపించడం లేదు అని ఆ వీడియోలో వెల్లడించాడు. చెల్లి ఫీల్ అవొద్దు...అస్సలు బాధపడొద్దు. అప్పులు చేసినప్పుడు తీర్చుకునే సత్తా కూడా ఉండాలి కానీ నాకు మాత్రం వాటిని తీర్చడానికి అవ్వట్లేదు..నా వల్ల కావట్లేదు..ఈ లైఫ్ ఇంక చాలు. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నాకు మీరంతా మంచి లైఫ్ ఇచ్చారు.

మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నా. ఇదే నా చివరి రోజు, చివరి క్షణం..ఏం జరగబోతోందో నాకే తెలీదు. ఢీ షోకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత నేమ్ అండ్ ఫెమ్ ఇచ్చినందుకు. ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు చేస్తూనే అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఢీ షో వల్ల పేరొస్తుంది కానీ రెమ్యూనరేషన్ రాదు. కానీ జబర్దస్త్ లో పేరు, రెమ్యూనరేషన్ చాల ఎక్కువ వస్తాయి అని చెప్పుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చైతన్య మాస్టర్. మొత్తం టీవీ ఇండస్ట్రీలోనే ఢీ షోకి ఉన్నంత ఫేమస్ మరే షోకి లేదు. అంత పాపులారిటీ సంపాదించుకుంది. 2009లో ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షో వరుసగా అన్ని సీజన్స్ తో డాన్స్ లవర్స్ ని అలరిస్తోంది. టాలెంటెడ్ డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్లకి సినీ అవకాశాలు కల్పించింది ఈ షో. ప్రస్తుతం ఢీ 15 ఛాంపియన్ షిప్ బాటిల్ పేరుతో ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నారు. ఈ షో రేటింగ్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి షోలో ఇప్పుడు ఒక అనుకోని విషాదం చోటుచేసుకుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.