English | Telugu

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో 'దేవర' చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది చివరికల్లా దేవర షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. దాని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

'దేవర' సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంటే దేవర కోసం ఎన్టీఆర్ మరో ఏడాది కేటాయించనున్నాడన్నమాట. 2024, ఏప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది. ఆలోపు ఎన్టీఆర్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'దేవర-2' షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. ఇది పూర్తయ్యే సమయానికి 2024 పూర్తయ్యి 2025 కూడా వచ్చేస్తుంది. ఇదే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ని 2024, మార్చిలో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడది 2025, మార్చికి వెళ్ళిపోయినా ఆశ్చర్యంలేదు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్-1' డిసెంబర్ 22 కి వాయిదా పడింది. 'సలార్-2' ఎప్పుడొస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అటు 'దేవర-2', ఇటు 'సలార్-2' పూర్తయితేనే.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కి 2025 లో మోక్షం కలుగుతుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.