English | Telugu

ప్రపంచానికి కావలసింది నీలాంటి మగాడే : అనసూయ

బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, కొన్ని విషయాలపై స్పందించే అనసూయకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. అంతేకాదు, తన వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్నిసార్లు ఇరుకున పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.

లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ కొత్త పోస్ట్‌తో అభిమానుల్ని పలకరించింది అనసూయ. తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఓ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వేసింది. అదేమిటంటే.. ‘నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి’ అంటూ అనసూయ వేసిన ట్వీట్‌తో తన భర్తపై ఆమెకు ఎంత ప్రేమ వుందో వ్యక్తమవుతోందని నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.