English | Telugu

హీరోయిన్లు కాదు.. ఐటెమ్ గాళ్స్‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు ఈత‌రం క‌థానాయిక‌ల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు హీరోయిన్లు ఎవ‌రూ లేర‌ని, ఉన్న‌వాళ్లంతా ఐటెమ్ గాళ్సేన‌ని వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ఓ స‌న్మాన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు దాస‌రి. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక‌ల్ని టార్గెట్ చేస్తూ.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇది వ‌ర‌కు సిల్క్‌స్మిత‌, జ్యోతిల‌క్ష్మి, జ‌య‌మాలిని, డిస్కోశాంతి లాంటి క‌థానాయిక‌లు ఉండేవాళ్ల‌ని, వాళ్లు కేవ‌లం ఐటెమ్ గీతాల‌కే ప‌రిమిత‌మ‌య్యేవార‌ని, ఇప్పుడు క‌థానాయిక‌లే ఐటెమ్ గాళ్స్‌గా మారిపోయార‌ని అన్నారు. ఇది వ‌ర‌కు సినిమాకి ఒక‌టో రెండో ప్ర‌త్యేక గీతాలుండేవి.. ఇప్పుడు ప్రతి పాటా అలానే ఉంటుంద‌ని చుర‌కేశారు. అందుకే క‌థానాయిక‌ల జీవిత కాలం ఐదారేళ్ల‌కు మించ‌డం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది వ‌ర‌కు కూడా దాస‌రి ఇలానే హీరోయిన్ల‌పై విరుచుకుప‌డ్డారు. సినిమా ఫంక్ష‌న్ల‌కు రారుగానీ, అవార్డుల కార్య‌క్ర‌మాల‌కైతే ఎగేసుకొస్తార‌న్నారు. అస‌లు క్ర‌మ‌శిక్ష‌ణ లేని క‌థానాయిక‌ల‌కు అవార్డులివ్వొద్ద‌న్నారు. ఇప్పుడు మ‌రోసారి వాళ్ల‌ని టార్గెట్ చేస్తూ మాట్టాడ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.