English | Telugu

'దసరా' వసూళ్ల ఊచకోత.. అంచనాలకు మించి ఓపెనింగ్స్!

'దసరా'తో నేచురల్ స్టార్ నాని సంచలనం సృష్టించాడు. మొదటి రోజు ఈ చిత్రం అంచనాలకు మించిన కలెక్షన్స్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.15 కోట్లకు పైగా షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా.. ఏకంగా రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం.

మొదటి రోజు నైజాంలో రూ. 6.78 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.36 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.5.08 కోట్ల షేర్ వసూలు చేయగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తంగా రూ.14.22 కోట్ల షేర్(రూ.24.85 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.2.58 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.4.20 కోట్ల షేర్ తో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్ల షేర్(రూ.38.40 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిందని అంచనా.

దసరా ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.48 కోట్లు కాగా.. రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజే రూ.21 కోట్ల షేర్ తో 43 శాతం రికవరీ చేసింది. ఇదే జోరు కొనసాగితే ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.