English | Telugu

దర్శన్ కి ఉరిశిక్ష విధించండని కోర్టులో వ్యక్తి గొడవ.. కోర్టు రియాక్షన్ ఇదే

రేణుక స్వామి(Renukaswami)ని చంపిన కేసులో ప్రముఖ కన్నడ హీరో 'దర్శన్'(Darshan),హీరోయిన్ 'పవిత్ర గౌడ్'(Pavithra Gowda)కి మంజూరైన బెయిల్ ని ఇటీవల సుప్రీంకోర్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్శన్, పవిత్ర గౌడ లని అరెస్ట్ చేసి బెంగుళూరు(Bengaluru)లోని 'పరప్పన అగ్రహార జైలు'కి తరలించారు. దర్శన్‌ మొదట నుంచి బళ్లారి జైలులో ఉన్నాడు. దీంతో అక్కడి జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసారు.

నిన్న ఈ పిటిషన్ విచారణకి వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఒక పిటిషన్ తో కోర్టు హాలులోకి చొరబడ్డాడు. జడ్జితో పెద్దగా మాట్లాడుతు 'దర్శన్ తో పాటు, ఈ కేసులో సంబంధం ఉన్న ఎవరకి బెయిల్ మంజూరు చేయకండి, దర్శన్‌కి మరణశిక్ష విధించాలని అభ్యర్థించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం జడ్జి మాట్లాడుతు నువ్వు ఎవరు అని అడిగారు.ఆ వ్యక్తి తన పర్సనల్ విషయాలు చెప్పగానే, ఎవరో సమర్పించిన దరఖాస్తుని అంగీకరించలేను. కేసు ఏదైనా సరే, ఆ వ్యక్తి పిటీషన్‌ కి దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్థాను. ఈ కేసుకి సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం జరగాలి. బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో సదరు వ్యక్తి కోర్టు గది నుంచి వెళ్లిపోయాడు.

దర్శన్ అభిమాని అయిన రేణుక స్వామి హత్య గత ఏడాది జూన్ 8 న జరిగింది. పవిత్ర గౌడ కి రేణుక స్వామి అసభ్య మెసేజెస్ పంపిస్తున్నాడనే కారణంతో, దర్శన్ మరి కొంత మంది తో కలిసి అత్యంత దారుణంగా చంపాడు. ఈ కేసుకి సంబంధించి మొత్తం పదిహేను మంది నిందితులుగా ఉన్నారు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.