English | Telugu

చిరుని, నయనతారను కలిసిన డాన్సర్ మురళి....

ఢీ 20 ఈ వారం ఎపిసోడ్ లో చాలా గుడ్ న్యూస్ లు వినిపించాయి. ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియాలో చిరంజీవి సాంగ్స్ కి చేసిన డాన్సస్ తో వైరల్ ఐన మురళి బాబాయ్ సెగ్మెంట్. నాగబాబు ప్రామిస్ చేసినట్టుగా మురళి బాబాయ్ ని చిరంజీవితో కల్పించారు. ఇంకా బాబాయ్ వెళ్లి ఆయన కాఫీ తాగి మాట్లాడారు అలాగే ఆయన ముందు కొన్ని స్టెప్పులు వేసి చూపించారు. ఈ విషయం గురించి మురళి బాబాయ్ మాట్లాడుతూ "ఆయన్ని చూస్తుంటే పరమేశ్వరుడిని చూసినట్టు ఉంది. సినిమా షూటింగ్ చేసి వస్తుంటే కుర్రోడిలా ఉన్నారు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మురళి గారు ఏడవకండి మీ లైఫ్ బాగుంటుంది. సర్ ఇంకా చనిపోతే చాలు సర్ నాకు. ఎలాగైనా కలవాలి అనుకున్న అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.

నన్ను ఈ స్టేజి వరకు తెచ్చింది అభి మాష్టర్ ఐతే చిరంజీవి గారి వరకు తీసుకెళ్లి పునర్జన్మ ఇచ్చింది ఆది గారు. నా 54 ఏళ్ళ వయసులో నేను ఇలా స్టేజి మీదకు వస్తాను అనుకోలేదు. నేను అనుకున్నది సాధించేసాను " అని చెప్పారు . తర్వాత ఆది మాట్లాడాడు. "రెండు గంటల సేపు కూర్చుని ఆయనతో మాట్లాడారు. చివరిగా ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఏదో ఒక రోజు నా మూవీలో నా పక్కన ఒక చిన్న మూవ్మెంట్ వేస్తావు" అన్నారు. "ఇక అనిల్ రావిపూడి అన్నకి అభిని పరిచయం చేసాను హా నాకెందుకు తెలీదు ఇన్స్టాగ్రామ్ లో మంచి హడావిడి చేస్తుంటాడుగా అన్నాడు. కార్డు ఉందా అని అడిగారు. తీసుకుంటున్నా అని చెప్పాను. తీసుకో త్వరగా అన్నారు. అది చాలు మనకు ఢీ చేస్తున్నాను మనం బయట వాళ్లకు తెలుస్తామో లేదో అనుకుంటాము. బాబోయ్ అందరూ చూస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళే చూస్తున్నారు" అని చెప్పారు ఆది, అభి. "మీసాల పిల్ల సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ సాంగ్ హుక్ మూవ్మెంట్ ఇచ్చి ఇది ప్రాక్టీస్ చెయ్యి అని మురళి బాబాయ్ ఇచ్చి వెళ్లారు చిరంజీవి. నిజంగా ఇది మామూలు అదృష్టం కాదు" అన్నాడు ఆది. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ మాట్లాడుతూ "ఢీ 19 వరకు ఒక లెక్క ఈ సీజన్ ఇంకో లెక్క. నేను మొన్న హాలిడేకి దుబాయ్ అబుదాబి వెళ్లాను. అక్కడ జనాలు అడుగుతున్నారు ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అని..ఏదో చేసేశాం అనుకోవద్దు. ప్రతీ డీటెయిల్ గమనిస్తున్నారు. మురళి గారు ఆల్ ది బెస్ట్. కుదిరితే మనం కూడా ఎప్పుడైనా తప్పకుండా పని చేద్దాం" అని చెప్పారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.