English | Telugu

యన్.టి.ఆర్. "దమ్ము" ఆడియో మార్చిలో

యన్.టి.ఆర్. "దమ్ము" ఆడియో మార్చిలో విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, త్రిష, కార్తీక నాయర్ హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, యువ డైనమిక్ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం"దమ్ము". ఈ యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రానికి తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతూంది.

ఇప్పటికే ఈ "దమ్ము" చిత్రం సెన్సేషనల్ బిజినెస్ అవుతూందని సినీ వర్గాలంటుండగా, ఈ చిత్రం యొక్క ఆడియోని మార్చ్ నెల తొలి వారంలో విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.