English | Telugu

మురుగదాస్ సినిమాలో అల్లు శిరీష్

మురుగదాస్ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా నటించనున్నాడు. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చిన్న కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తమ్ముడు, మెగాస్టార్, పవర్ స్టార్, నాగబాబులకు మేనల్లుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి బావ అయిన అల్లు శిరీష్ కూడా హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరు తెలుగు హీరోల్లా తెలుగు సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయకుండా తమిళ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయటం విశేషం.

సూపర్ హిట్టయిన "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మించనున్నారు. ఆ సినిమాలో హీరోగా అల్లు శిరీష్ నటించనున్నాడని సమాచారం. దీనితో పాటు ప్రముఖ దర్శక, నిర్మాత "గజిని" మురుగదాస్ తమిళంలో నిర్మించనున్న "తొట్టాం పూమళరుమ్" అనే చిత్రంలో కూడా అల్లు శిరీష్ హీరోగా నటించనున్నాడు. దీని కోసం తన "సౌత్ స్కోప్" పత్రికను కూడా చెన్నైకి చెందిన ఒక కంపెనీకి దాన్ని అమ్మేశాడట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.