English | Telugu

యన్.టి.ఆర్. హీరోగా సుకుమార్ చిత్రం

యన్.టి.ఆర్. హీరోగా సుకుమార్ చిత్రంరాబోతూందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో సీనియర్ యన్.టి.ఆర్. హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించిన చలసాని గోపీ కుమారుడు చలసాని రామ్ భద్రం చౌదరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బోయపాటి దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నయన్.టి.ఆర్. "దమ్ము" చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతూంది. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్.టి.ఆర్.హీరోగా నటించే చిత్రం ప్రారంభం కానుంది. దీని తర్వాత ఈ యన్.టి.ఆర్. హీరోగా సుకుమార్ చిత్రం రాబోతూందని తెలిసింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటించబోయే చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించే పనిలో ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.