English | Telugu

అప్పుడే ఓటీటీలోకి నాగ చైతన్య 'కస్టడీ'!

అక్కినేని నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీ 'కస్టడీ'. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చైతన్య ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. గతేడాది 'థాంక్యూ'తో నిరాశపరిచిన చైతన్య, ఈ సినిమాతో లెక్క సరిచేస్తాడని అక్కినేని అభిమానులు కూడా భావించారు. కానీ మే 12 న థియేటర్లలో విడుదలైన 'కస్టడీ' అంచనాలకు అందుకోలేక పరాజయం పాలైంది. ఇప్పుడు ఈ సినిమా నాలుగు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'కస్టడీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రైమ్ ప్రకటించింది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో ఆదరణ పొందలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.