English | Telugu

టెంప‌ర్‌ లో కామెడీ కలుపుతారట!

పూరి - ఎన్టీఆర్‌లు క‌ల‌సి ఆంధ్రావాలా ఫ్లాప్ కి బ‌దులు తీర్చుకొన్నారు. క‌థ‌పై దృష్టి పెడితే.. ఎలాంటి ప‌లితం వ‌స్తుందో వీళ్ల‌కు అర్థ‌మైంది టెంప‌ర్‌తోనే. సినిమా అంతా బాగానే ఉంది గానీ.. పూరి సినిమాల్లో ఉండే వినోదం పాళ్లు త‌గ్గాయి అని ప్రేక్ష‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యం పూరి దృష్టికీ వెళ్లింది. అందుకే... ఇప్పుడు కొత్త‌గా కొన్ని సీన్లు యాడ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌థ‌కి అడ్డంగా ఉన్నాయ‌ని..ట్రిమ్మింగ్‌లో భాగంగా అలీ - స‌ప్త‌గిరి మ‌ధ్య తీసిన కొన్ని సీన్స్ లేపేశారు. ఇప్పుడు వాటిని మ‌ళ్లీ యాడ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ సెకండాఫ్‌లో క‌లుపుతార‌ట‌. దాంతో సీరియ‌స్ నెస్ నుంచి కాస్త రిలీఫ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సీన్స్ యాడ్ అవుతున్నాయి. మ‌రి ఈ సీన్స్ వ‌ల్ల వ‌సూళ్ల‌లో ఎంత మార్పు వ‌స్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.