English | Telugu

ఈ వ్య‌వ‌హారం చిరుకీ న‌చ్చ‌ట్లేదు..

మేము సైతం అంటూ తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ ఆర్భాటంగా ఓ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రేపే.. ఆ హంగామా. అయితే ప‌రిశ్ర‌మ‌లో లుక‌లుక‌ల‌న్నీ ఈ కార్య‌క్ర‌మంతో మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో ఐక‌మ‌త్యం లేద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఇండ్ర‌స్ట్రీ అంతా ఒకే తాటిపైకొచ్చి చేయాల్సిన ఈ కార్య‌క్ర‌మం కూడా - పైపై మెరుగుల్లానే క‌నిపిస్తోంది. ప‌రిశ్ర‌మ‌కు మూల స్థంభాల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రెస్ ముందుకు రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎన్టీఆర్‌. మ‌హేష్‌బాబు, బ‌న్నీ, ప్ర‌భాస్.. వీళ్లెవ‌రూ మాట వ‌ర‌స‌కు కూడా క‌నిపించ‌లేదు. కొంత‌మంది అధీనంలోనే ఈ కార్య‌క్ర‌మ‌మంతా జ‌ర‌గ‌డం... మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తిని క‌లిగిస్తోంది. అస‌లెందుకు.. ఈ కార్య‌క్ర‌మ వివ‌రాలు ప‌రిశ్ర‌మ‌కే పెద్ద దిక్కు అయిన దాస‌రి నారాయ‌ణ‌రావుకే తెలియ‌ప‌ర్చ‌డం లేద‌ట‌. చిరంజీవికీ అస‌లు మేము సైతం వ్య‌వ‌హారం బొత్తిగా న‌చ్చ‌ట్లేద‌ని తెలుస్తోంది. ''అస‌లేం జ‌రుగుతోంది..? ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా కీల‌క‌మైన నిర్ణ‌యాలు ఎలా తీసుకొంటారు? అన్నీ మీరే అనేసుకొంటే ఇక మేముండి ఏంలాభం?'' అని మేము సైతం నిర్వాహ‌కుల‌పైనే చిరు త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన‌ట్టు స‌మాచారం. పైగా ఈ కార్య‌క్ర‌మానికి పొలిటిక‌ల్ ట‌చ్ కూడా త‌గిలింది. మేము సైతం కార్య‌క్ర‌మం మొత్తం అధికార టీడీపీ ప్ర‌భుత్వాన్నీ, చంద్ర‌బాబు నాయుడినీ మ‌చ్చిక చేసుకోవ‌డానికి కొంత‌మంది బ‌డా నిర్మాత‌లు వేస్తున్న గాలం అనే ప్ర‌చారం ఉదృతంగా ఉంది. అందుకే ఈ కార్య‌క్ర‌మం జోలికి వెళ్ల‌క‌పోతేనే మంచిదేమో.. అని చిరు భావిస్తున్నాడ‌ట‌. మొత్తానికి ఓ మంచి ఉద్దేశంతో త‌ల‌పెట్టిన ఈకార్య‌క్ర‌మంలో లుక‌లుక‌లు పెరిగి.. అస‌లు ల‌క్ష్యానికే తూట్లు పొడుస్తుందేమోన‌న్న భయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రో 24 గంట‌లు ఆగితే... అస‌లు ర‌హ‌స్యాల‌న్నీ బోధ‌ప‌డ‌తాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.