English | Telugu

చిరంజీవి, బాలకృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన! 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకి లభించిన గొప్ప వరం. సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తూ అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వారివురి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి కూడా హాజరవుతుంటారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసిపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రతినిధులతో టికెట్ రేట్స్ పెంపు గురించి మాట్లాడడానికి చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున,మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారు చర్చలు జరపడానికి వెళ్లారు. ఆ సమయంలో బాలకృష అందుబాటులో లేడు. ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బాలకృష్ణ మాట్లాడుతు చిరంజీవి వెళ్లడం వల్ల టికెట్ రేట్స్ పెంచలేదని, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడటం జరిగింది. చిరంజీవి వల్ల పెంచలేదని యాదృచ్చికంగా అన్న మాట. ఆ మాటల వెనక గత ప్రభుత్వం సినిమా వాళ్ళని అవమానించిందని బాలకృష్ణ ఉద్దేశ్యం. ఆయన పూర్తి ప్రసంగం వింటే ఈ విషయం తెలుస్తుంది. కానీ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా ఆ దుష్ట శక్తులు అదే పనిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ విషయంపై ఎలా మాట్లాతాడనే చర్చ అందరిలో జరుగుతుంది. పవన్ ఇటీవల అస్వస్థతకి గురి కావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

పవన్, బాలకృష్ణ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. పైగా కూటమి ద్వారా అధికారంలో ఉన్నారు. రీసెంట్ గా 'ఓజి'(OG)రిలీజ్ అయినప్పుడు బాలకృష్ణ మాట్లాడుతు తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది. ఘన విజయం సాధించాలని మాట్లాడాడు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.