English | Telugu

మన దేశం కోసం చేస్తున్న ‘చిరు’ సాయం ఇది!

ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్నిసార్లు మానవ జీవనం అస్తవ్యస్తంగా మారుతూ ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా తారలు తమ వంతు సాయం అందించడం మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా తన వల్ల కొన్ని ప్రాణాలైనా కాపాడాలి, తన వల్ల కొంతమందికైనా చూపు వస్తే అదే తనకు సంతృప్తినిస్తుందని నమ్మిన హీరో మన మెగాస్టార్‌ చిరంజీవి. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు సాయం అందిస్తున్నారు మెగాస్టార్‌.

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రస్ట్‌ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ట్రస్ట్‌ ద్వారా బ్లడ్‌, ఐ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ... ‘ఈ ట్రస్ట్‌ ప్రారంభించిన నాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నాను. సమాజ సేవలో ఇదొక అద్భుతమైన జర్నీ. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల బ్లడ్‌ను ట్రస్ట్‌ ద్వారా సేకరించడం జరిగింది. ఆ బ్లడ్‌ను అత్యవసరం వున్న వారికి అందించాము. అలాగే ఐ బ్యాంక్‌ ద్వారా 10 వేల మందికి కంటి చూపు వచ్చేలా చేశాము. ఈ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాల కోసం తమ వంతు సాయం అందిస్తున్న అక్కా చెల్లెళ్ళకు, అభిమానులకు శాల్యూట్‌ చేస్తున్నాను. మన దేశం కోసం మనం చేస్తున్న చిరు సాయమిది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల కలిగే సంతృప్తిని నేను మాటల్లో చెప్పలేను’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.