Read more!

English | Telugu

సరైనోడు ఆడియోకు చిరు వస్తున్నారా..?


 

అల్లు అర్జున్ సరైనోడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మార్చి మూడోవారంలో విశాఖపట్టణంలో ఆడియో లాంఛ్ చేయబోతున్నామని మూవీ టీం ప్రకటించింది కూడా. లాంఛ్ కు మెగా స్టార్ చిరంజీవిని ఛీఫ్ గెస్ట్ గా పిలవాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన అందుబాటులో ఉన్న టైం ను ప్రకటించే ఉద్దేశంతో ఎగ్జాక్ట్ డేట్ ను ప్రకటించలేదు. ఆయన వచ్చే డేట్ బట్టి ఆడియో డేట్ ను కూడా ఫిక్స్ చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా మూవీ టీం కి మంచి కిక్ ఇచ్చిందట. ఈ మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్, క్యాథరీన్ ట్రెసా హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నాడు. హీరో ఆది పినిశెట్టి, విలన్ క్యారెక్టర్ చేయడం విశేషం. ఏప్రిల్ 22న రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగరం సమాచారం.