English | Telugu

చంద్రమోహన్‌ ఆరోగ్యంగానే వున్నారు

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చంద్రమోహన్‌ మేనల్లుడు కృష్ణప్రసాద్‌ తెలిపాడు. ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌కు గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావటంతో, బందువులు, సన్నిహితులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అయితే చంద్రమోహన్‌ మేనల్లుడు మాత్రం తమ మామయ్య ఆరోగ్యంగానే ఉన్నాడని అంటున్నాడు. మామయ్య ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో ఆసుపత్రిలో చేర్చాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కృష్ణప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రమోహన్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం నేపథ్యంలో ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.