English | Telugu

మహేష్ "బిజినెస్ మ్యాన్"ఆడియో శిల్పకళా వేదికలో

మహేష్ "బిజినెస్ మ్యాన్"ఆడియో శిల్పకళా వేదికలో జరుగనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"బిజినెస్ మ్యాన్". ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 20 తేదీకల్లా పూర్తవుతుందట. తమన్ సంగీతం అందించిన మహేష్ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియోని, డిసెంబర్ 22 వ తేదీన, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనున్నారట.

మహేష్ "బిజినెస్ మ్యాన్" చిత్రాన్ని మాత్రం సంక్రాంతి పండుగ కానుకగా 2012 జనవరి 11 వ తేదీన విడుదల చేస్తారు. "పోకిరి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం, అలాగే "దూకుడు" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ఇదే కావటంతో ఈ మహేష్ "బిజినెస్ మ్యాన్" మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.