English | Telugu

బాలయ్య వర్సెస్ బోయపాటి.. ఎవరిది పైచేయి?

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో మూడు సినిమాలు రాగా, మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నాలుగోసారి చేతులు కలపడానికి కూడా ఈ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా కలిసి పనిచేసి హ్యాట్రిక్ కొట్టిన ఈ ద్వయం.. త్వరలో నువ్వా నేనా అన్నట్లుగా బాక్సాఫీస్ బరిలోకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరాకు బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. బాలకృష్ణ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'NBK 108'(వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు సినిమాలకు సంక్రాంతి, దసరా పండుగలు పెద్ద సీజన్లు. ఆ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ప్రేక్షకుల ఆదరణ పొందుతాయి. మరి ఈ దసరా బరిలో దిగుతున్న రామ్-బోయపాటి, 'NBK 108' చిత్రాలలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.