English | Telugu

"ఒక్క అడుగు"కు జక్కన్న గ్రీన్ సిగ్నల్...!

"బాహుబలి" చిత్రం విడుదల అవ్వాలంటే దాదాపు రెండు సంవత్సరాలు పట్టేట్లుగా ఉందని రాజమౌళిని ఒప్పించి "మిర్చి" సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. అయితే ఇటీవలే మళ్ళీ "బాహుబలి" షూటింగ్ ప్రారంభమయినప్పటికి, ఎందుకో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తుంది.

ఇదిలా ఉంటే కృష్ణంరాజు తన సొంత బ్యానర్లో ప్రభాస్ తో "ఒక్క అడుగు" చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఎందుకంటే "బాహుబలి" చిత్ర షూటింగ్ వాయిదా పడుతుండటంతో... ఈ గ్యాప్ లో ఎలాగైనా "ఒక్క అడుగు" చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. దీనికి "బాహుబలి" చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంట. ప్రస్తుతం "ఒక్క అడుగు" చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయ్యిందని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఇంకో విషయమేమిటంటే.... "బాహుబలి" కోసం తన గెటప్ ను పూర్తిగా కండల వీరుడిగా మార్చేసిన ప్రభాస్.. "ఒక్క అడుగు" చిత్రం షూటింగ్ లో పాల్గొంటే "బాహుబలి" గెటప్ లోనే కనపడే అవకాశాలున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.