English | Telugu

ఒకే ఒక్క టీజర్.. రికార్డ్ బ్రేక్ అంతే..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్ర మొదటి టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే కేవలం ఈ చిత్ర వర్కింగ్ సన్నివేశాలతో మాత్రమే విడుదలైన ఈ టీజర్ కు అశేష స్పందన వస్తుంది.ఈ టీజర్ విడుదలయిన ఒకటిన్నర రోజులోనే యూట్యూబ్ లో 5,92,096 మంది వీక్షించారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" సినిమా టీజర్ ను ఒకటిన్నర రోజులో 4,68,564 మంది వీక్షించారు. అంటే ఇప్పటి వరకున్న పవన్ రికార్డును ప్రభాస్ బద్దలుకొట్టినట్లే కదా. మరి ఈ సినిమా విడుదలై మరో ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేస్తుందని అనడంలో ఎలాంటి సంకోచం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.