English | Telugu

తిరుపతిలో 'బాహుబలి' ఆడియో

టాలీవుడ్ దర్శకసంచలనం యస్‌.యస్‌.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి`ది బిగినింగ్‌’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం ఈ నెల 13న తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని ‘యువ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.’ సొంతం చేసుకొంది.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ..ప్రసాద్‌ దేవినేని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.