English | Telugu

'బాహుబలి' వర్సెస్ 'బజరంగి భాయ్‌జాన్‌'

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్లు రాబడుతున్న 'బాహుబలి'కి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. మొదటి వారంలో ఎలాంటి పోటీలేకుండా కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి, రెండో వారంలోకి వచ్చే సరికి అసలైన పోటీ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయ్‌జాన్‌' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్లలో భారీగా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..'బజరంగి భాయ్‌జాన్‌' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ల తో బహుబలికి గట్టి పోటీని ఇస్తోంది. సల్మాన్ ఖాన్ కి ఓవర్సీస్, ఇండియ డొమెస్టిక్ మార్కెట్ లలో కూడా మంచి క్రేజ్ వుండడంతో బాహుబలి కలెక్షన్లు చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

మరి సల్మాన్ ఖాన్ క్రేజ్ ని కూడా తట్టుకొని 'బాహుబలి' బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తుందా? లేక 'బజరంగి భాయ్‌జాన్‌' 'బాహుబలి' కలెక్షన్లకు గండి కొడతారా అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.